బీజేపీ, టీఆర్ఎస్ చీకటి ఒప్పందం బట్టబయలైంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలకు కేసీఆర్ జై కొడుతున్నారు
- గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అన్నట్టు వీరి తీరు ఉంది
- సాగర్ లో జానారెడ్డిని గెలిపించుకోవాలి
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం బట్టబయలైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొచ్చినా కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని దుయ్యబట్టారు. గల్లీమే కుస్తీ, ఢిల్లీమే దోస్తీ అన్నట్టుగా ఈ పార్టీల వ్యవహారం ఉందని చెప్పారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవ కోసం జానారెడ్డి పాటుపడ్డారని... అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు.