మాకు ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యం: ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి
- ఏపీలో స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటన
- అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీఎన్జీవో సంఘం
- షెడ్యూల్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని స్పష్టీకరణ
- కోర్టులకైనా వెళతామని వెల్లడి
ఊహించని విధంగా ఎస్ఈసీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఉద్యోగులు విస్మయానికి గురయ్యారని వెల్లడించారు. ఎన్నికల వాయిదా కోసం న్యాయస్థానాలకైనా వెళతామని, తాము ఏ పార్టీకి కొమ్ముకాయడంలేదని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తమకు ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని ఉద్ఘాటించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.