కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న శిల్పా శిరోద్కర్!
- దుబాయ్ లో వ్యాక్సిన్ వేయించుకున్న శిల్పా శిరోద్కర్
- తనకు వ్యాక్సిన్ ఇచ్చినందుకు యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిన శిల్ప
- వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితంగా ఉంటుందని హితవు
మరోవైపు బాలీవుడ్ నటి శిల్పాశిరోద్కర్ కరోనా టీకా వేయించుకున్నారు. ఈమె మరెవరో కాదు, సినీ నటుడు మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కు సోదరి. తాను వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. దుబాయ్ లో ఉంటున్న ఆమె... అక్కడే వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే సురక్షితంగా ఉంటుందని... మనం మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చని ఈ సందర్భంగా ఆమె అన్నారు. తనకు వ్యాక్సిన్ ఇచ్చినందుకు యూఏఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెపుతున్నానని వ్యాఖ్యానించారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కావడం గమనార్హం.