నన్నెందుకు చిత్రవధకు గురిచేస్తున్నారు?: కంగన రనౌత్
- ట్విట్టర్ లో స్పందించిన కంగన
- తనకు ఎదురవుతున్న వేధింపులపై ఆవేదన
- దేశం సమాధానాలు చెప్పాలంటూ ట్వీట్
- తనకు మద్దతు కావాలంటూ విజ్ఞప్తి
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనా తన గళాన్ని బలంగా వినిపించారు. ఇండస్ట్రీలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెకు, ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముంబయిలోని ఆమె కార్యాలయాన్ని అధికారులు పాక్షికంగా కూల్చివేయడం జరిగింది. కొందరు నేతలకు, కంగనాకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కూడా నడిచాయి.