బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సరికాదు: సోయం బాపురావు
- తోలు తీస్తామని టీఆర్ఎస్ నేతలు అనడం సరికాదు
- ఇలాగే మాట్లాడితే చూస్తూ ఊరుకోబోం
- పార్లమెంటు సమావేశాల్లో నిర్మల్ జిల్లా సమస్యలపై మాట్లాడతా
రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని సోయం బాపురావు చెప్పారు. తమ అజెండాలో పేర్కొన్న రామ మందిర నిర్మాణం హామీని నిలబెట్టుకున్నామని... మందిర నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో నిర్మల్ జిల్లా సమస్యలపై మాట్లాడతానని చెప్పారు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు చేపట్టాల్సిన రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం బడ్జెట్ ఇవ్వలేదని... అందువల్లే ఆ పనులు ఆగిపోయాయని విమర్శించారు.