అమెరికాలో ప్రజాస్వామ్యంపై దాడి ఆందోళనకరం: చంద్రబాబు
- అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్ వద్ద హింస
- ట్రంప్ మద్దతుదారుల ఆందోళనలు
- పోలీసుల కాల్పుల్లో మహిళ మృతి
- ప్రజాస్వామ్యం దాడిని ఖండించాల్సిందేనన్న చంద్రబాబు
అమెరికాలో తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ గెలుపును ధ్రువీకరించేందుకు ఇవాళ కాంగ్రెస్ సభ్యులు క్యాపిటల్ బిల్డింగ్ లో సమావేశం కాగా.... ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఆందోళనలకు యత్నించారు. ఈ సందర్భంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది.