గాంధీ ఆసుపత్రిలో కళ్లు తిరిగి పడిపోయిన అఖిలప్రియ
- కిడ్నాప్ కేసులో అరెస్టయిన అఖిలప్రియ
- వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు
- గాంధీ ఆసుపత్రిలో అస్వస్థతకు గురైన వైనం
- సెలైన్ ఎక్కిస్తున్న ఆసుపత్రి సిబ్బంది
ఓ భూ వివాదానికి సంబంధించిన వ్యవహారంలో మాజీ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో అఖిలప్రియను పోలీసులు ఏ2 నిందితురాలిగా పేర్కొన్నారు. ఆమె భర్త భార్గవరామ్ ను ఏ3గా ప్రకటించారు. ప్రస్తుతం భార్గవరామ్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు.