రామతీర్థంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నాం... చట్టాలను ఎవరూ అతిక్రమించవద్దు: డీఎస్పీ సునీల్
- రామతీర్థం ధర్మయాత్రకు పిలుపునిచ్చిన బీజేపీ-జనసేన
- నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- రామతీర్థంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందన్న డీఎస్పీ
- సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టీకరణ
రామతీర్థంలో సెక్షన్ 30 అమలు చేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించద్దని స్పష్టం చేశారు. పైగా, కొవిడ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయని వివరించారు. చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్సీ సునీల్ హెచ్చరించారు. విగ్రహ ధ్వంసం ఘటనపై దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.