vijaya shanti: సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే: విజ‌య శాంతి

  • తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు
  • ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ గారు అన్నారు
  • దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు
  • వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారు
  • రైతుల వద్దే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం  
vijaya shanti slams kcr

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల విష‌యంలో కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణ‌యాల వ‌ల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు.

 'తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు... రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా బంద్ అయ్యేలా... సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తూ పరిస్థితులు ఘోరంగా మారిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ గారు అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయి' అని విజ‌య‌శాంతి అన్నారు.

'ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారు. రైతుల వద్దే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం సంగతేమిటో... తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆరెస్ ప్రభుత్వానిదే... ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు' అంటూ విజ‌య‌శాంతి విమర్శించారు.

  • Loading...

More Telugu News