Gudivada: గుడివాడలో పేకాటకు సంబంధించి కీలక ప్రకటన చేసిన కృష్ణా జిల్లా ఎస్పీ

Krishna district SPs response on Gudivada playing cards incident
  • పేకాట ఆడుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది
  • ఎస్ఈబీ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు
  • రూ. 55.39 లక్షలు స్వాధీనం చేసుకున్నాం
కృష్ణా జిల్లా గుడివాడలో ఓ పేకాట స్థావరం పై పోలీసులు జరిపిన దాడి రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఆ స్థావరాన్ని నిర్వహిస్తున్నది మంత్రి కొడాలి నాని అనే ఆరోపణలు వచ్చాయి. అయితే, తనకు, దానికి ఎలాంటి సంబంధం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు కీలక ప్రకటన చేశారు.

తమిరిశలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం వచ్చిందని... వెంటనే ఎస్ఈబీ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారని ఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో 33 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. రూ. 55.39 లక్షలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 28 కార్లు, 13 బైకులను స్వాధీనం చేసుకుని, 33 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.

పొట్లూరు మురళి అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ పేకాట శిబిరం నడుస్తోందని ఎస్పీ తెలిపారు. మూడు గంటల పాటు కొనసాగిన దాడులను వీడియో తీశామని చెప్పారు. గత వారం రోజుల్లో దాదాపు 100 పేకాట శిబిరాలపై దాడులు చేశామని... అయితే, ఈ దాడి మాత్రమే హైలైట్ అయిందని అన్నారు. రాజకీయ నాయకులు చేసే ఆరోపణలపై తాము స్పందించబోమని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు, పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Gudivada
Playing Cards
Kodali Nani
Krishna District
SP

More Telugu News