Sensex: కొత్త ఏడాదిని లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు

  • 118 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 37 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2 శాతానికి పైగా లాభపడ్డ ఐటీసీ, టీసీఎస్
Stock markets starts new year with profits

దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభాల్లోనే పయనించాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు కొంతమేర లాభాల స్వీకరణకు పాల్పడటంతో, లాభాలు తగ్గిపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 118 పాయింట్లు లాభపడి 47,869కి చేరుకుంది. నిఫ్టీ 37 పాయింట్లు పెరిగి 14,019 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.32%), టీసీఎస్ (2.02%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.71%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.67%), భారతి ఎయిర్ టెల్ (1.14%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.36%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.83%), టైటాన్ కంపెనీ (-0.57%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.34%), బజాజ్ ఫైనాన్స్ (-0.30%).

More Telugu News