కోహ్లీ ర్యాంకు మారలేదు.. రహానె మళ్లీ దూసుకొచ్చాడు!
- టెస్ట్ ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ
- రెండో స్థానంలోనే విరాట్ కోహ్లీ
- ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి రహానె
- బౌలింగ్ లో అశ్విన్ 7, బుమ్రాకు 9వ స్థానం
కాగా, బౌలింగ్ విభాగంలో 793 పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ ఏడో స్థానానికి వచ్చాడు. రెండు స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. 783 పాయింట్లు సాధించిన జస్ ప్రీత్ బుమ్రా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్స్ ర్యాంకింగ్స్ లో రవీంద్ర జడేజా తన మూడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భాగంగా మూడు వికెట్లు తీసి 57 పరుగులు చేసిన జడేజా.. జాసన్ హోల్డర్ తో ఉన్న అంతరాన్ని ఏడు పాయింట్లకు తగ్గించుకోగలిగాడు.
మొత్తంగా బ్యాటింగ్ లో 890 పాయింట్లతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, బౌలింగ్ లో 909 పాయింట్లతో ఆస్ట్రేలియా స్పీడ్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. బ్యాటింగ్ లో చతేశ్వర్ పుజారా 728 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు.