ఈడీ విచారణకు హాజరుకాని సంజయ్ రౌత్ భార్య
- పీఎంబీ మనీలాండరింగ్ కేసులో సంజయ్ రౌత్ భార్య
- జనవరి 5 వరకు తనకు సమయం కావాలని కోరిన వర్ష రౌత్
- 120 మంది బీజేపీ నేతలు ఈడీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్న సంజయ్ రౌత్
మరోవైపు సంజయ్ రౌత్ మాట్లాడుతూ, బాలాసాహెబ్ థాకరేకు చెందిన శివసైనికుడినని చెప్పారు. బీజేపీ నేతల నిజస్వరూపాలను, అవినీతిని తాను బయటపెడతానని అన్నారు. మనీలాండరింగ్ కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో 120 మంది బీజేపీ నేతలు ఉన్నారని చెప్పారు.నీరవ్ మోదీ, విజయ్ మాల్యా మాదిరి బీజేపీ నేతలు విమానాలెక్కి విదేశాలకు చెక్కేయాలని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థిని ముఖాముఖి ఎదుర్కోవడం చేతకానప్పుడు ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతారని విమర్శించారు.