Pratyusha: బంగారు నక్లెస్ ను కానుకగా ఇచ్చి, ప్రత్యూషను పెళ్లికూతురిగా అలంకరించిన కేసీఆర్ భార్య శోభ!

  • నేడు ప్రత్యూష వివాహం
  • నిన్న రాత్రి అలంకరించిన శోభ
  • ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో కార్యక్రమం
KCR Wife Gifted Diamond Necles to Pratyusha

కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం నేడు జరగనున్న నేపథ్యంలో, నిన్న రాత్రి ఆమెను పెళ్లి కూతురిగా అలంకరించారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ లో జరుగగా, సీఎం కేసీఆర్ సతీమణి శోభ హాజరై, వధువుకు డైమండ్ నక్లెస్, పట్టుబట్టలు పెట్టి ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, మహిళాభివృద్ధి కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య తదితరులు హాజరయ్యారు. కాగా, చరణ్ రెడ్డితో ప్రత్యూష వివాహం నేడు రంగారెడ్డి జిల్లా పాటిగడ్డ లార్డు మాత సన్నిధిలో జరగనున్న సంగతి తెలిసిందే. 

More Telugu News