Kodimi: అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కు ఈ విధంగా థ్యాంక్స్ చెప్పారు!

  • ఏపీలో క్రిస్మస్ నాడు ఇళ్ల పట్టాల పంపిణీ
  • అనంతపురం జిల్లాలోనూ పట్టాల అందజేత
  • సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కొడిమి ప్రజలు
  • థాంక్యూ జగనన్న అంటూ ఆంగ్ల అక్షరాల ఆకృతిలో నిల్చున్న ప్రజలు 
Ananthapur district people expresses their gratitude towards CM Jagan

ఏపీలో క్రిస్మస్ సందర్భంగా భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలోనూ పట్టాలు అందించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కొడిమి ప్రాంతంలో ఇళ్ల పట్టాలు పొందిన ప్రజలు సీఎం జగన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. థాంక్యూ జగనన్న అంటూ ఆంగ్ల అక్షరాల ఆకృతిలో నిల్చుని సీఎంపై తమ ప్రేమను చాటుకున్నారు. ఈ విన్యాసం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ దృశ్యాలను డ్రోన్ ద్వారా చిత్రీకరించగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

More Telugu News