Raja Singh: రాజాసింగ్ కు ఏపీ వైసీపీ నేత సవాల్!

  • మల్లికార్జున స్వామిని ఏ మతం వారైనా పూజించొచ్చు
  • దేవస్థానంలో నా పేరు మీద ఒక్క పని కూడా చేయలేదు
  • ఆరోపించే ముందు ఒకసారి ఆలోచించాలి
AP YSRCP leader challenges Raja Singh

తెలంగాణ బీజేపీ నేత రాజాసింగ్ పై ఏపీ వైసీపీ నేత రజాక్ మండిపడ్డారు. శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తనను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని రాజాసింగ్ ఆరోపించారని... ఆ ఆరోపణలను నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు చక్రపాణి రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

శ్రీశైల మల్లికార్జునస్వామిని ఏ మతం వారైనా పూజించవచ్చని రజాక్ అన్నారు. ఇతర మతస్తులు పూజించకూడదని హిందూ మత గ్రంథంలో రాశారా? అని ప్రశ్నించారు. తన పేరు మీద శ్రీశైలం దేవస్థానంలో ఒక పని కూడా చేయలేదని చెప్పారు. ఇతర ముస్లింలకు కూడా దేవస్థానంలో ఎలాంటి కాంట్రాక్టులు ఇప్పించలేదని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని... ఆరోపించే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News