ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్ఐఏకు చిక్కిన ఖలిస్థాన్ ఉగ్రవాది
- సిక్కు ఉగ్రవాదాన్ని పునరుద్ధించే ప్రయత్నం
- నిషేధిత ఉగ్రవాద సంస్థల్లోకి యువతను ఆకర్షిస్తున్నట్టు ఆరోపణలు
- సైప్రస్లో తలదాచుకున్న నిందితుడు
- దేశ బహిష్కరణతో స్వదేశానికి
1984 ఆపరేషన్ బ్లూస్టార్, ఖలిస్థాన్ అనుకూల పోస్టులు చేసేవాడు. అంతేకాక, నిషేధిత ఉగ్రవాద సంస్థల్లోకి యువతను ఆకర్షించినట్టు ఎన్ఐఏ ఆరోపిస్తోంది. గుర్జీత్ సింగ్ 2017లో సైప్రస్ వెళ్లి తలదాచుకున్నాడు. అయితే, ఈ కేసులో అక్కడ అతడిపై లుక్ అవుట్ నోటీసులు జారీ కావడంతో ఆ దేశం గుర్జీత్ను దేశం నుంచి బహిష్కరించింది. దీంతో అతడు ఢిల్లీ రాగా ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. తదుపరి దర్యాప్తు కోసం అధికారులు అతడిని ముంబై తరలించనున్నారు.