Mahesh Babu: 'సర్కారు వారి పాట'కు అమెరికాలో లొకేషన్ ఎంపిక!

  • పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట'
  • తొలి షెడ్యూలు షూటింగ్ హైదరాబాదులోనే
  • తదుపరి షెడ్యూలు నిర్వహణ షికాగోలో
  • స్థానిక అధికారుల అనుమతులు లభ్యం  
Location finalized for Mahesh film shoot

కరోనా కారణంగా ఆలస్యమైన సినిమాలలో మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట' కూడా వుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగు తొలి షెడ్యూలును అమెరికాలో నిర్వహించాలని మొదట్లో ప్లాన్ చేసినప్పటికీ, కరోనా నేపథ్యంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దాంతో హైదరాబాదులోనే ఈ షెడ్యూలును నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే నెలలో ఇక్కడ షూటింగును ప్రారంభిస్తారు.

ఇక హైదరాబాదు షెడ్యూలు ముగిసిన అనంతరం అమెరికా షూటింగుకి యూనిట్ బయలుదేరుతుంది. బ్యాంక్ స్కాముల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది కాబట్టి బ్యాంకు వాతావరణంలో ఎక్కువ షూటింగ్ వుంటుందట. దాంతో అమెరికాలో తమ కథకు అవసరమైన ఒరిజినల్ బ్యాంకును ఎంచుకున్నట్టు తెలుస్తోంది. షికాగోలో షూటింగుకి అవసరమైన బ్యాంకును మాట్లాడుకున్నట్టు, షూటింగుకి అక్కడి స్థానిక అధికారుల అనుమతులు కూడా లభించినట్టు సమాచారం. ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది.

More Telugu News