మధ్యశ్రేణి క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
- ఒడిశాలోని బాలసోర్ కేంద్రం నుంచి ప్రయోగం
- మానవ రహిత విమానాన్ని కుప్పకూల్చిన మిస్సైల్
- మాక్ 2 వేగంతో పయనం
- పరిధి 100 కిలోమీటర్లు
- త్రివిధ దళాలకు ఉపయుక్తం
ఈ క్షిపణిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సహకారంతో డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం వీటిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) ఉత్పత్తి చేస్తోంది. ఈ క్షిపణిని సైన్యం, వాయుసేన, నేవీ ఎవరి అవసరాలకు తగిన విధంగా వారు ఉపయోగించుకునే వీలుంది. మాక్ 2 వేగంతో ప్రయాణించే ఈ మిస్సైల్ పరిధి 100 కిలోమీటర్లు. ఇవాళ ఆర్మీ వెర్షన్ మిస్సైల్ ను పరీక్షించారు.