Adithyanath Das: క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్

  • రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మార్పులు
  • ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యనాథ్ దాస్
  • ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ సాహ్ని 
  • అదే రోజున బాధ్యతలు స్వీకరించనున్న ఆదిత్యనాథ్ దాస్
Newly appointed CS Adithyanath Das met CM Jagan

ఏపీ పరిపాలనా యంత్రాంగంలో ఉన్నతస్థాయిలో మార్పులు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులు కాగా, ఈ నెల 31న పదవీవిరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని సీఎం ముఖ్య సలహాదారుగా కొత్త బాధ్యతలందుకోనున్నారు.

 ఈ నేపథ్యంలో, నూతన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా అక్కడే ఉన్నారు. కాగా, ఈ నెల 31తో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ పదవీకాలం ముగియనుండగా, అదేరోజున ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు.

More Telugu News