ప్రకాశం జిల్లాలో దారుణం.. శ్రీకృష్ణ ఆలయంలో రక్తం, మాంసం చల్లిన దుండగులు!
- దర్శిలోని పడమటి బజారులోని ఆలయంలో దారుణం
- ఆలయంలోని గోడలకు కూడా రక్తపు ముద్రలు వేసిన దుండగులు
- తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికంగా కలకలం రేగింది. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు వచ్చారు. జరిగిన ఘటనపై వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే దర్శిలో ఇలాంటి ఘటన జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారంతో ఆలయం వద్దకు చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.