Jammu And Kashmir: కుటుంబీకులు చెప్పారని లొంగిపోయిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు... కశ్మీర్ లో అనూహ్య ఘటన!

Terrorists Surrender in Kulgam
  • కుల్గామ్ సమీపంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం
  • ఎన్ కౌంటర్ మొదలు కాగానే లొంగిపోయిన వైనం
  • ఫిస్టల్స్, మందుగుండు స్వాధీనం
ఓ ఇంట్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాగున్నారని తెలుసుకున్న భారత జవాన్లు ఎన్ కౌంటర్ ప్రారంభించగా, ఉగ్రవాదుల కుటుంబీకులు వారికి నచ్చజెప్పడంతో వారు లొంగిపోయారు. ఈ ఘటన జమ్ము కశ్మీర్ పరిధిలోని తొంగుడౌను ప్రాంతంలో జరిగింది. ఇది ఓ అనూహ్య ఘటనని కశ్మీర్ జోన్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని వివరాలను అధికారులు వెల్లడిస్తూ, ఇద్దరు ఉగ్రవాదులు కుల్గామ్ సమీపంలోని తొంగుడౌనులో దాగున్నారని తెలుసుకుని పోలీసులు, జవాన్లు ఆ ప్రాంతానికి వెళ్లారని తెలియజేశారు. ఆపై ఎన్ కౌంటర్ జరుగుతుండగా, తమ వారిని లొంగిపోవాలని కుటుంబీకులు కోరారని, దీంతో వారు లొంగిపోయారని అన్నారు. వారి నుంచి ఉగ్రవాద సాహిత్యంతో పాటు రెండు పిస్టల్స్, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Jammu And Kashmir
Kulgam
Terrorists
Surrender

More Telugu News