Nani: 'తుపాను ముందటి నిశ్శబ్దం..' అంటున్న నాని!

  • 'టక్ జగదీశ్' పూర్తిచేసిన హీరో నాని 
  • 'శ్యామ్ సింగరాయ్' షూట్ లో చేరిక 
  • లొకేషన్ ఫొటోను షేర్ చేసిన కథానాయకుడు  
  • నాయికలుగా సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా    
Nani joins Shyam Singa Rai shoot

ఏ పాత్ర పోషించినా మన పక్కింటి అబ్బాయిలా కనపడుతూ.. సహజత్వంతో నటించే హీరో నాని ఎంచుకునే కథలు కూడా కొత్తగా ఉంటాయి. యూత్ ని ఆకట్టుకునే కొత్త తరహా కథలను ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా 'టక్ జగదీశ్' చిత్రాన్ని చేస్తున్నాడు. లాక్ డౌన్ కి ముందు ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు దాదాపు పూర్తయింది.

దాంతో తన తదుపరి చిత్రం 'శ్యామ్ సింగరాయ్'పై దృష్టి పెట్టాడు. 'టాక్సీవాలా' ఫేమ్  రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నాని కెరీర్లోనే అత్యధిక వ్యయంతో అంటే 40 కోట్ల బడ్జెట్టుతో దీనిని నిర్మిస్తున్నారు.

ఇక ఈ చిత్రం రెగ్యులర్ షూటింగులో హీరో నాని ఈ రోజు జాయిన్ అయ్యాడు. ఈ విషయం తెలుపుతూ, ఇన్ స్టాగ్రామ్ లో లొకేషన్లో దిగిన ఓ పిక్ ను పోస్ట్ చేశాడు. 'తుపాను ముందటి నిశ్శబ్దం..' అంటూ దానికి క్యాప్షన్ కూడా జోడించాడు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్నీ సమకూరుస్తున్నాడు.

More Telugu News