అమిత్ షా చెప్పినట్టు జరిగితే ట్విట్టర్ ను వదిలేస్తా: ప్రశాంత్ కిశోర్
- బెంగాల్ లో బీజేపీకి కనీసం 200 సీట్లు వస్తాయన్న అమిత్ షా
- బీజేపీ సీట్లు రెండంకెల సంఖ్యను దాటవన్న ప్రశాంత్ కిశోర్
- డబుల్ డిజిట్ దాటితే ట్విట్టర్ ను వదిలేస్తానని వ్యాఖ్య
అమిత్ షా వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ... బీజేపీకి దక్కే స్థానాలు రెండంకెల సంఖ్యను దాటవని అన్నారు. డబుల్ డిజిట్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందితే... తాను ట్విట్టర్ ను వదిలేస్తానని చెప్పారు. తాను చేసిన ఈ ట్వీట్ ను సేవ్ చేసి పెట్టుకోవాలని అన్నారు. బీజేపీకి మద్దతిస్తున్న మీడియా ఎంత ప్రచారం చేసినా... బీజేపీకి రెండంకెల సంఖ్యకు మించి స్థానాలు రావని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.