మాస్క్ ధరించలేదని.. ఒక్క రోజులో 12 వేల మందికి జరిమానా వేసిన ముంబై అధికారులు!
- దాదార్, అంధేరీ తదితర ప్రాంతాల్లో దాడులు
- ఇప్పటివరకూ రూ. 14 కోట్లకు పైగా జరిమానా వసూలు
- కఠిన చర్యలకు దిగుతున్న అధికారులు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన క్లీన్ అప్ మార్షల్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, పలు ప్రాంతాల్లో మకాం వేసి మాస్క్ ధరించని వారిని పట్టుకుని అక్కడికక్కడే జరిమానాలు వేశారు. దాదర్, అంధేరీ, గోరేగావ్, మలాడ్, మాతుంగా తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. రోజూ కనీసం 20 వేల మంది మాస్క్ లు లేని వారికి జరిమానాలు వేయాలని ఇటీవల బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహాల్ ఆదేశించినట్టు తెలుస్తోంది.