Andhra Pradesh: ఏపీలో కరోనా నుంచి కోలుకున్న మరో 715 మంది బాధితులు!

  • 24 గంటల్లో కొత్తగా 478 కేసుల నమోదు
  • కరోనా వల్ల ముగ్గురి మృతి
  • రాష్ట్రంలో ప్రస్తుతం 4,420 యాక్టివ్ కేసులు
AP registers 3 Covid deaths and 715 recoveries today

ఏపీలో కరోనా వైరస్ విస్తరణ క్రమంగా నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 715 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ముగ్గురు వ్యక్తులు కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. వీరిలో ఇద్దరు విశాఖ జిల్లా, ఒకరు కడప జిల్లాకు చెందినవారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 4,420 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,76,814కి చేరింది. మొత్తం మరణాలు 7,067కి చేరుకున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 64,099 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

More Telugu News