కరోనా నుంచి కోలుకుని పక్షవాతానికి గురైన నటి శిఖా మల్హోత్రా
- నర్సింగ్ విద్యను అభ్యసించి సినీరంగంలోకి
- తిరిగి నర్సుగా మారి కొవిడ్ రోగులకు సేవలు
- కరోనా నుంచి కోలుకున్నంతలోనే స్ట్రోక్
ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శిఖ పక్షవాతానికి గురైనట్టు ఆమె మేనేజర్ అశ్విన్ శుక్లా తెలిపారు. ఆమె ఫొటోను పోస్టు చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. శిఖ కుడివైపు స్ట్రోక్ వచ్చిందని, ప్రస్తుతం ఆమె కూపర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. కాగా, బాలీవుడ్లోకి ప్రవేశించిన శిఖ పలు సినిమాల్లో నటించారు. షారూఖ్తో కలిసి ‘ఫ్యాన్’ సినిమాలో నటించారు. ఆ సినిమా శిఖాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.