Farmers: నిరసనల వేళ రహదారులపై క్రికెట్ ఆడిన రైతన్నలు!

  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు
  • ఇవాళ నిరాహార దీక్ష చేపట్టిన రైతులు
  • దీక్షలో పాల్గొన్న 32 సంఘాల నేతలు
  • రోడ్లనే మైదానాలుగా భావించి క్రికెట్ ఆడిన రైతులు
  • నెట్టింట సందడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు
Farmers plays cricket on raids amidst protests

జాతీయస్థాయిలో తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులో గత కొన్నివారాలుగా నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేంద్రంతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో ఇవాళ ఒక్కరోజు దీక్షలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతులు రోడ్లపై క్రికెట్ ఆడుతూ దర్శనమిచ్చారు.

రైతుల నిరసనలకు నేడు 19వ రోజు కాగా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో 32 రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. కాగా, పలు చోట్ల రైతులు క్రికెట్ ఆడారు. ఢిల్లీ-హర్యానా హైవే పైనా, ఘాజీపూర్ బోర్డర్ వద్ద ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

More Telugu News