కంగనా రనౌత్ పై హక్కుల ఉల్లంఘన నోటీసును ఫైల్ చేసిన శివసేన ఎమ్మెల్యే
- గత నెలలో ప్రతాప్ సర్నాయక్ స్థలాలలో సోదాలు నిర్వహించిన ఈడీ
- గత వారం సర్నాయక్ ను ప్రశ్నించిన అధికారులు
- సోదాల్లో పాకిస్థానీ క్రెడిట్ కార్డులు బయటపడ్డాయన్న కంగన
మనీ లాండరింగ్ కేసులో సర్నాయక్ ను గత వారం ఈడీ విచారించింది. దాదాపు 6 గంటలకు పైగా ఆయనను విచారించింది. గత నెలలో ఆయనకు చెందిన స్థలాలలో సోదాలు నిర్వహించారు.
మరోవైపు కంగనపై ఇప్పటికే మహారాష్ట్ర శాసనమండలిలో ప్రివిలేజ్ మోషన్ ను మూవ్ చేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా అభివర్ణించినందుకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.