A Chandra Sekhar: బీజేపీలో చేరనున్న మరో కాంగ్రెస్ నేత

  • జోరందుకుంటున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్
  • బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి చంద్రశేఖర్
  • ఇంటికి వెళ్లి చర్చలు జరిపిన డీకే అరుణ
Former minister A Chandra Sekhar to join BJP

తెలంగాణలో బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ మరింత జోరందుకోబోతోంది. పలువురు నేతలతో బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులను బీజీపీ ప్రస్తుతం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంతో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం. ఆయన ఇంటికి వెళ్లి డీకే అరుణ చర్చలు జరిపారని, బీజేపీలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు చెపుతున్నారు. వికారాబాద్ లో సభను ఏర్పాటు చేసి... అక్కడ పార్టీలో చేరుతారని సమాచారం. కాంగ్రెస్ కు చెందిన మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

ఉమ్మడి ఏపీలో చంద్రశేఖర్ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ పార్టీలో ఆయన ఒకొనొక సమయంలో వెలుగు వెలిగారు. తెలంగాణ వస్తే దళితుడే సీఎం అవుతాడంటూ కేసీఆర్ ప్రకటించడంతో... చంద్రశేఖర్ సీఎం అవుతారనే చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన టీఆర్ఎస్ ను వీడి... మళ్లీ కాంగ్రెస్ లో చేరారు.

More Telugu News