Uttam Kumar Reddy: టీపీసీసీ కోమటిరెడ్డి కేనా?... ముందుగానే అభినందనలు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!

  • నిన్న కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
  • తుది నిర్ణయం తీసుకునే బాధ్యత సోనియాపై
  • ఎవరు అధ్యక్షుడైనా సహకరిస్తానన్న ఉత్తమ్
Uttam Kumars All the Best to Komatireddy

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయగా, తదుపరి ఆ బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పదవికి పలువురు కాంగ్రెస్ నేతల పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి, వీ హనుమంతరావు సహా పలువురు ఆశావహులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతల కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక నిమిత్తం పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ నేతృత్వంలో గాంధీ భవన్ లో కోర్ కమిటీ సమావేశం జరుగగా, తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను సోనియా గాంధీకి అప్పగిస్తున్నట్టు మాత్రమే నిర్ణయం వెలువడింది. ఆపై ఓ ఆసక్తికర ఘటన జరిగింది.

సమావేశం ముగియగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉత్తమ్ కుమార్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. దీంతో టీపీసీసీ బాధ్యతలు ఆయనకే దక్కవచ్చని, ఈ విషయం ముందే ఉత్తమ్ కు తెలిసిపోయిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇక ఇదే విషయమై మీడియా ఆయన్ను ప్రశ్నించగా, కోర్ కమిటీలో తన అభిప్రాయాన్ని చెప్పలేదని, పార్టీ అధినేత్రి నిర్ణయమే తన నిర్ణయమని, ఎవరు అధ్యక్షుడైనా పూర్తిగా సహకరిస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News