Jagan: 'జగనన్న జీవ క్రాంతి' ప్రారంభం... గొర్రెపిల్ల, కంబళితో సీఎం

CM Jagan launches Jagananna Jeeva Kranthi
  • మహిళల స్వావలంబనే లక్ష్యంగా 'జగనన్న జీవ క్రాంతి'
  • క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన సీఎం
  • రూ.1,869 కోట్లతో 2.49 లక్షల మేకలు, గొర్రెలు పంపిణీ
  • ఇప్పటికే గేదెలు, ఆవుల పంపిణీ
  • కరవు వచ్చినా జీవాలు రైతులకు ఆదరవుగా ఉంటాయన్న సీఎం

మహిళల స్వయంసమృద్ధే లక్ష్యంగా తీసుకువచ్చిన 'జగనన్న జీవ క్రాంతి' పథకానికి ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేతిలో గొర్రె పిల్లను ఎత్తుకుని, భుజంపై కంబళి వేసుకుని, తాటాకుల గొడుగు పట్టుకుని అలరించారు.

కాగా, 'జగనన్న జీవ క్రాంతి' పథకంలో భాగంగా రాష్ట్రంలో 2.49 లక్షల మేకలు, గొర్రెలు పంపిణీ చేయనున్నారు. ఈ పథకానికి రూ.1,869 కోట్ల వ్యయం కానుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ, వ్యవసాయం మాత్రమే కాకుండా మేకలు, గొర్రెలు, పశువులు, చేపలు, కోళ్ల పెంపకం కూడా చేపడితే రైతుల కుటుంబాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయని అభిప్రాయపడ్డారు.

కరవు కాటకాలు వచ్చి వ్యవసాయంలో నష్టం వచ్చినా, ఈ జీవాలు రైతులకు ఆదరవుగా ఉంటాయని వివరించారు. ఇప్పటికే ఆవులు, గేదెల పంపిణీ ప్రారంభించామని, అందుకోసం రూ.3,500 కోట్లు వెచ్చిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వాలు ఏనాడూ వ్యవసాయ అనుబంధ రంగాలను పట్టించుకోలేదని ఆరోపించారు.


.

  • Loading...

More Telugu News