KCR: సోనియా జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చండి: కేసీఆర్‌కు దాసోజు శ్రవణ్ లేఖ

  • నిన్న సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుక
  • ఈ సందర్భంగా కేసీఆర్‌కు లేఖ రాసిన శ్రవణ్ 
  • సోనియా గాంధీ వల్లే తెలంగాణ ఏర్పడిందన్న ఉత్తమ్
dasoju writes letter to kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఓ లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జీవిత చరిత్రను తెలంగాణలోని పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఆయన కోరారు. నిన్న సోనియా గాంధీ 74వ జన్మదిన వేడుకను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్‌కు ఈ లేఖ రాశారు.

కాగా, తమ పార్టీ  అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ నేత ఉత్తమ్ ‌కుమార్‌రెడ్డి అన్నారు. నిన్న సోనియా 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని టీపీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఓ కార్యక్రమం నిర్వహించి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

More Telugu News