Hardhik Pandya: ఇక ఇంటికి వెళుతున్నా: టీ-20లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనంతరం హార్దిక్ పాండ్యా భావోద్వేగం

  • పరిమిత ఓవర్ల క్రికెట్ కే పరిమితం
  • టెస్ట్ సిరీస్ కు ఎంపిక కాని హార్దిక్ పాండ్యా
  • టీ-20లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు
  • బిడ్డను చూసేందుకు ఇంటికి పయనం
Hardhik Pandya Back to India

ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ లో పరిమిత ఓవర్ల క్రికెట్ కు మాత్రమే పరిమితమైన హార్దిక్ పాండ్యా, టీ-20 సిరీస్ విజయం అనంతరం సగర్వంగా స్వదేశానికి బయలుదేరనున్నాడు. దాదాపు గత నాలుగు నెలలుగా తన బిడ్డకు, కుటుంబానికి దూరంగా ఉన్న హార్దిక్, నిన్నటి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభిస్తుందని ఎంతమాత్రమూ ఊహించలేదని చెప్పాడు.

ఐపీఎల్, ఆపై ఆస్ట్రేలియాతో వన్డేలు, టీ-20 సిరీస్ ల అనంతరం హార్దిక్ కు విశ్రాంతిని ఇవ్వాలని భావించిన బీసీసీఐ అతన్ని టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. దీంతో హార్దిక్ నేడో, రేపో స్వదేశానికి బయలుదేరనున్నాడు. ఈ నేపథ్యంలో మాట్లాడిన హార్దిక్, జట్టు కలిసికట్టుగా రాణించడంతోనే టీ-20 సిరీస్ లో గెలుపు సాధ్యమైనందని అన్నారు.

వన్డే సిరీస్ లో రెండు వరుస మ్యాచ్ లను ఓడిపోయిన అనంతరం, తమకు మిగిలింది నాలుగు మ్యాచ్ ల సిరీస్ అనుకున్నామని, అందుకు తగ్గట్టుగానే మూడు మ్యాచ్ లలో వరుసగా గెలిచామని తెలిపిన పాండ్యా, ఇప్పుడు జట్టు సభ్యులంతా ఆనందంగా ఉన్నారని చెప్పాడు.

సిరీస్ మొదలైన తరువాత తనకు ఇంటర్వ్యూలు ఇవ్వాలని అనిపించలేదని, ఇప్పుడు మాత్రం సంతోషంగా ఉందని చెప్పాడు. ఇక ఇండియాకు వెళ్లి, తన బిడ్డతోనూ, కుటుంబ సభ్యులతోనూ కొంతకాలం సంతోషంగా గడుపుతానని చెప్పాడు. కాగా, ఆస్ట్రేలియాలో పర్యటన అనంతరం హార్దిక్, టీ-20 వరల్డ్ కప్ తో పాటు ఐపీఎల్ కు సిద్ధం కానున్నాడు.

More Telugu News