China: భారత్ తో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నాం: చైనా

Talking with India to reduce border dispute says China
షార్ట్స్‌లో చూడండి
భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు తీయని కబుర్లు చెపుతూనే మరోవైపు రెచ్చగొట్టే విధంగా చైనా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఉన్నత స్థాయిలో పలు సమావేశాలు జరిగినా ఇంత వరకు సమస్యకు పరిష్కారం లభించలేదు.

ఈ నేపథ్యంలో చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ మాట్లాడుతూ, ప్రతిష్టంభన తొలగిపోయేలా ఇండియాతో చర్చలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరంగానే కాకుండా, మిలిటరీ ఉన్నతాధికారుల స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బోర్డర్ సమస్యలను చక్కదిద్దేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయాలు కుదిరిన తర్వాత వాటి అమలుపై తదుపరి విధివిధానాలు ఉంటాయని తెలిపారు.
Go Back to Shorts
China
India
Border Dispute

More Telugu News