జానారెడ్డి బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై భట్టి కామెంట్
- జానారెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతోంది
- కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయి
- బీజేపీ, ఎంఐఎం మతతత్వాన్ని రెచ్చగొట్టాయి
ఈరోజు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవడంపైనే చర్చించామని భట్టి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం మతతత్వాన్ని రెచ్చగొట్టాయని చెప్పారు. హైదరాబాదు నగరం ప్రమాదంలో ఉందంటూ ప్రచారం చేసుకుని టీఆర్ఎస్ లబ్ధి పొందిందని అన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఈ మూడు పార్టీలు సీట్లను సాధించాయని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్ధాంతాలకు దూరంగా వెళ్లలేదని అన్నారు. ప్రస్తుత ఫలితాలను చూసి కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన చెందవద్దని, ఇది తాత్కాలికం మాత్రమేనని, కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.