కరోనా వ్యాక్సిన్ ట్రయల్ డోస్ వేయించుకున్న హర్యానా మంత్రికి కరోనా పాజిటివ్
- వ్యాక్సిన్ వేయించుకున్న రెండు వారాలకు పాజిటివ్
- అంబాలాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి
- రెండు డోసులు వేసుకుంటేనే ఫలితమన్న కేంద్ర ఆరోగ్య శాఖ
ఈ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పందిస్తూ, వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాతే మనిషి శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందుతాయని తెలిపింది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్ అని వెల్లడించింది. అనిల్ విజ్ కేవలం ఒక డోస్ మాత్రమే తీసుకున్నారని చెప్పింది.