గోవాలో శ్రుతిహాసన్ తో ఆడిపాడుతున్న రవితేజ!
- రవితేజ, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా 'క్రాక్'
- గోవాలో నేటి నుంచి చివరి పాట చిత్రీకరణ
- సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటన
- రవితేజను పోలీసాఫీసర్ గా చూపిస్తున్న గోపీచంద్
తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే దీనిని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు కూడా. రవితేజ నటించిన గత చిత్రం 'డిస్కో రాజా' ప్రేక్షకాదరణ పొందలేదు. దాంతో ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలను జోడించినట్టు చిత్రం యూనిట్ చెబుతోంది. మరి, ఇతర సినిమాల తాకిడిని తట్టుకుని సంక్రాంతి రేసులో ఈ చిత్రం ఎంతవరకు నిలబడుతుందో చూడాలి!