బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కంగనా రనౌత్ కు సిక్కు కమిటీ నోటీసులు

Sikh body demands Kangana Ranaut for apology
  • రైతుల ఆందోళనల్లో పాల్గొంటున్న మహిళలపై విమర్శలు
  • రూ. 100 ఇస్తే ఇలాంటి వారు చాలా మంది వస్తారని వ్యాఖ్య
  • కంగనపై ఢిల్లీ గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ ఆగ్రహం
కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. పంజాబ్, హర్యానాల నుంచి వచ్చిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్నారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

వంద రూపాయలు ఇస్తే ఇలాంటి మహిళలు చాలా మంది వస్తారని కంగన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారిని తాను కూడా చాలా మందిని తీసుకురాగలనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సిక్కు సంఘాలు మండిపడుతున్నాయి. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్ మెంట్ కమిటీ కంగనకు నోటీసులు పంపింది. వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అయితే, ఆ తర్వాత కంగన తన ట్వీట్ ను తొలగించింది. అయితే ఇంతవరకు కంగన క్షమాపణలు చెప్పలేదు. సిక్కు కమిటీ నోటీసులపై స్పందించలేదు.
Go Back to Shorts
Kangana Ranaut
Sikh Gurudwara
Notice
Bollywood

More Telugu News