Mahesh Babu: మహేశ్ సినిమా కోసం బ్యాంక్ సెట్ సిద్ధమవుతోంది!

  • మహేశ్, కీర్తి జంటగా 'సర్కారు వారి పాట'
  • బ్యాంకు స్కాముల నేపథ్యంలో సాగే కథ
  • బ్యాంక్ సెట్లో నెల రోజుల షూటింగ్
  • జనవరిలో అమెరికాలో మరో షెడ్యూలు  
Bank set erected for Mahesh movie

మహేశ్ బాబు, కీర్తి సురేశ్ తొలిసారిగా కలసి జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వాస్తవానికి ఈపాటికి చాలా పూర్తవ్వాలి. అయితే, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అందులోనూ అమెరికాకు వెళ్లి ఎక్కువ భాగం షూటింగ్ చేయాల్సి ఉండడంతో అది మరింత ఆలస్యం అవుతోంది.

మొదట్లో ఈ నెలలో అమెరికాలో తొలి షెడ్యూలు షూటింగ్ చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, కరోనా పరిస్థితుల నేపథ్యంలో దానిని వాయిదా వేశారు. దాంతో తొలి షెడ్యూలును హైదరాబాదులో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం హైదరాబాదులో ఓ జాతీయ బ్యాంక్ సెట్ ను వేస్తున్నారు. ఇది త్వరలో పూర్తవుతుంది. ఇందులో నెల రోజుల పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ నిర్వహిస్తారు.

అనంతరం జనవరి నెలాఖరులో మరో షెడ్యూలు కోసం అమెరికా వెళతారు. బ్యాంకు స్కాముల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. అలాగే విదేశాలతో కూడా కథకు లింక్ ఉండడంతో యూఎస్ షూటింగును ప్లాన్ చేస్తున్నారు.

More Telugu News