కరోనా వైరస్ మహమ్మారి ముక్కు ద్వారా మెదడులోకి కూడా చొరబడుతుందట!
- లక్షల మందిని కబళించిన కరోనా
- మెదడులోనూ వైరస్ ఆవాసం
- దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ
- నరాలకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం
సార్స్ కోవ్-2 కేవలం శ్వాస వ్యవస్థనే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందని, తత్ఫలితంగా రుచి, వాసన కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం, నరాలకు సంబంధించిన సమస్యలు కలుగుతాయని పేర్కొన్నారు.
కాగా, ఇటీవలి ఓ అధ్యయనంలో... మెదడులోనూ, సెరెబ్రోస్పైనల్ ద్రవాల్లోనూ వైరస్ కు సంబంధించిన ఆర్ఎన్ఏ ఉన్నట్టు గుర్తించినా, వైరస్ ఎలా ప్రవేశిస్తోందీ.. మెదడులోపలి భాగాల్లో ఎలా పాకిపోతోంది? అన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఇది ముక్కు ద్వారానే మెదడులో చొరబడుతోందన్న విషయం తాజా అధ్యయనం ద్వారా వెల్లడైంది.
గొంతు పైభాగంలో ఉండే నాసికాగ్రసనిలో తొలిస్థావరం ఏర్పరచుకుంటున్న కరోనా రక్కసి, అక్కడి నుంచి నాసికా కుహరం ద్వారా మెదడులోకి పాకుతోందని తెలుసుకున్నారు. కరోనాతో మరణించిన 33 మంది రోగులపై పరిశోధనలు చేసి ఈ వివరాలు గుర్తించారు. కాగా, కరోనా వైరస్ కు సంబంధించిన జన్యుపదార్థం ఆర్ఎన్ఏ... ఘ్రాణ శ్లేష్మ పొరలో అత్యధిక పాళ్లలో ఉన్నట్టు జర్మనీ పరిశోధకులు కనుగొన్నారు.