ఎన్డీయే నుంచి బయటకు వస్తామంటూ అమిత్ షాను హెచ్చరించిన ఆర్ఎల్పీ
- ఎన్డీయేలో దుమారం రేపుతున్న కొత్త వ్యవసాయ చట్టాలు
- వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసిన ఆర్ఎల్పీ
- లేకపోతే ఎన్డీయేలో కొనసాగడంపై పునరాలోచిస్తామని వార్నింగ్
'మిస్టర్ అమిత్ షా, కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నాం. ఈ మూడు చట్టాలను వెంటనే ఉపసంహరించుకోండి. స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేయండి. ఢిల్లీలో నిరసన చేపట్టిన రైతులతో వెంటనే చర్చలు జరపండి. ఆర్ఎల్పీ అనేది ఎన్డీయేలో ఒక భాగస్వామి. కానీ, రైతులు, జవాన్ల వల్లే మనకు అధికారం దక్కింది. ఈ అంశానికి సంబంధించి వెంటనే సరైన చర్యలు తీసుకోకపోతే... ఎన్డీయేలో కొనసాగడంపై నేను పునరాలోచించుకోవాల్సి వస్తుంది' అని బేనీవాల్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై అమిత్ షా ఇంకా స్పందించాల్సి ఉంది.