Janak Raj: కారుకు నిప్పంటుకుని వ్యక్తి మృతి... రైతుల 'చలో ఢిల్లీ'లో విషాదం

Tragedy takes place in Chalo Delhi
  • కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులు
  • చలో ఢిల్లీకి పిలుపు
  • రైతుల ట్రాక్టర్లు రిపేర్లు చేసేందుకు వెళ్లిన వ్యక్తి
  • కారులో నిద్రిస్తుండగా సజీవ దహనం
కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను దేశంలోని పలు రాష్ట్రాల్లో రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా రైతు సంఘాలు 'చలో ఢిల్లీ'కి పిలుపునివ్వగా, పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ చేరుకున్నారు. వారు తమ ట్రాక్టర్లతో సహా రాజధానికి వచ్చారు. అయితే, ఆ రైతుల ట్రాక్టర్లకు ఏవైనా మరమ్మతులు వస్తే సరిదిద్దడానికి పంజాబ్ కు చెందిన జనక్ రాజ్ అనే మెకానిక్ కూడా స్వచ్ఛందంగా ఢిల్లీ వచ్చాడు. నిన్న కొన్ని ట్రాక్టర్లకు మరమ్మతులు చేసిన అనంతరం ఓ కారులో విశ్రమించాడు.

అయితే ఆ కారుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో 55 ఏళ్ల జనక్ రాజ్ మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. రైతులకు మేలు చేసేందుకు వెళ్లి తానే బలైపోయిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ విషాద ఘటనపై శిరోమణి అకాలీదళ్ చీఫ్ హర్ సిమ్రన్ కౌర్ బాదల్ స్పందించారు. రైతు ఉద్యమ చరిత్రలో జనక్ రాజ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.
Janak Raj
Chalo Delhi
Fire Accident
Car
New Delhi
Punjab

More Telugu News