రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

AP assembly sessions will start tomorrow
  • అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం
  • 1,637 మంది పోలీసులతో బందోబస్తు
  • సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి వెలగపూడిలో జరగనున్నాయి. శాసనసభ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 1,637 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ, నలుగురు ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 58 మంది సీఐలు, 9 మంది ఆర్ఐలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించారు. గరుడ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు బాధ్యతల పర్యవేక్షణ నిర్వహిస్తామని చెప్పారు. ఐటీ కోర్ టీమ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంటుందని తెలిపారు.
Go Back to Shorts
AP Assembly Session
Security
Police
Drone
Velagapudi
Amaravati
Andhra Pradesh

More Telugu News