వచ్చేసిన వరుస సెలవులు.. సొంతూళ్లకు క్యూ కడుతున్న నగరవాసులు
- రేపు కార్తీక పౌర్ణమి, ఎల్లుండి బల్దియా ఎన్నికలు
- విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు రద్దీ
- ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందంటున్న నేతలు
ముఖ్యంగా విజయవాడవైపు వెళ్లే వాహనాల కారణంగా దిల్సుఖ్నగర్ నుంచి హయత్నగర్ వరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. సొంతవాహనాలతోపాటు బస్సుల్లో వెళ్లే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. వరుస సెలవుల కారణంగా పెద్ద ఎత్తున నగరం ఖాళీ అవుతుండడంతో ఆ ప్రభావం గ్రేటర్ ఎన్నికలపై పడుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.