Mahavira: తమిళనాడులో 10వ శతాబ్దానికి చెందిన వర్ధమాన మహావీరుడి విగ్రహం లభ్యం

  • దట్టమైన అడవుల్లో విగ్రహం
  • సగం వరకు మట్టిలో కూరుకుపోయిన వైనం
  • విగ్రహం పురాతనమైనదని తేల్చిన నిపుణులు
Mahavira sculpture found in Tamilnadu

భారతదేశంలో జైన మతాన్ని పునరుద్ధరించిన 24వ, చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. కాగా, 10వ శతాబ్దం నాటి మహావీరుడి విగ్రహం తాజాగా తమిళనాడులో వెలుగుచూసింది. తిరువణ్ణామలై జిల్లా పోలూరు వద్ద దట్టమైన అటవీప్రాంతంలో ఈ విగ్రహం లభ్యమైంది. కె.జీవన్ కుమార్ అనే జైన మతగురువు ఈ విగ్రహాన్ని గుర్తించారు. మట్టితో సగం కప్పివేసిన స్థితిలో ఉన్న ఈ విగ్రహం మూడు అడుగుల ఎత్తు ఉంది.

స్థానికులు ఈ విగ్రహాన్ని బుద్ధ ప్రతిమ అనుకున్నారు. దీన్ని పరిశీలించిన నిపుణులు తమిళ జైనులు విలసిల్లిన కాలం నాటిదని వెల్లడించారు. విగ్రహ నిర్మాణ శైలి, శిల్పకళ మొదలైన అంశాల ఆధారంగా అది 10వ శతాబ్దం నాటిదని భావిస్తున్నారు. కాగా, ఈ విగ్రహం లభ్యమైన విషయాన్ని జీవన్ కుమార్ జైన మఠానికి తెలియజేశారు. ఈ మహావీర విగ్రహాన్ని సంరక్షించేందుకు అక్కడ ఓ నిర్మాణం చేపట్టనున్నారు.

More Telugu News