హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
- దేశంలో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలిస్తున్న ప్రధాని
- అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ రాక
- భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ అభివృద్ధి పరిశీలన
ప్రధాని మోదీ హైదరాబాదులో భారత్ బయోటెక్ క్యాంపస్ ను సందర్శిస్తారు. భారత్ బయోటెక్ లో కోవాగ్జిన్ పేరిట కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఇది మూడో దశ ప్రయోగాల్లో ఉంది. పూర్తి దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ కావడంతో కొవాగ్జిన్ పై అన్ని వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. హైదరాబాద్ పర్యటన అనంతరం ప్రధాని పూణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శిస్తారు.