IYR Krishna Rao: కొన్ని సందర్భాల్లో ఎలా మాట్లాడాలో బాగా తెలిసిన వ్యక్తి బండి సంజయ్: తాజా పరిణామాలపై ఐవైఆర్ వ్యాఖ్యలు
హుస్సేన్ సాగర్ వద్ద ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలంటూ ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించగా, ఆ పని చేస్తే రెండు గంటల్లోనే నీ దారుస్సలాం భవనాన్ని కూల్చుతాం అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాలపై ఏపీ బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.
ప్రత్యర్థి భాషను బట్టి, రెచ్చగొట్టే విధానాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నిర్మొహమాటంగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది సరిగా అవగాహన చేసుకున్న వ్యక్తి బండి సంజయ్ అని కొనియాడారు. లేకపోతే సంస్కారాన్ని బలహీనతగా అర్థం చేసుకునే అవకాశం ఉందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రత్యర్థి భాషను బట్టి, రెచ్చగొట్టే విధానాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో నిర్మొహమాటంగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇది సరిగా అవగాహన చేసుకున్న వ్యక్తి బండి సంజయ్ అని కొనియాడారు. లేకపోతే సంస్కారాన్ని బలహీనతగా అర్థం చేసుకునే అవకాశం ఉందని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.