Couple: పెళ్లివేడుకలో దొరికిపోయిన 'దొంగ' దంపతులు... చితకబాది పోలీసులకు అప్పగించిన జనాలు!

  • కామారెడ్డిలో ఘటన
  • బంధువులమంటూ పెళ్లికి వచ్చిన దంపతులు
  • వధువు తరపు మహిళ నుంచి బంగారం చోరీ
Couple enters into wedding hall and stole gold from a woman

కొన్ని సందర్భాల్లో వివాహాలు, ఇతర ఫంక్షన్లలో తెలియని వాళ్లు కూడా వచ్చి తినేసి వెళ్లిపోతుంటారు. కొన్నిసార్లు చోరీలు కూడా జరుగుతుంటాయి. కామారెడ్డిలోని అయ్యప్ప ఫంక్షన్ కూడా ఇలాంటి ఓ ఘటనకు వేదికగా నిలిచింది. అక్కడ పెళ్లి జరుగుతుండగా ఓ జంట ప్రత్యక్షమైంది. కామారెడ్డి ఇందిరానగర్ కు చెందిన పరమేశ్, యశోద బంధువులమంటూ పెళ్లికి వచ్చారు.

వచ్చిన దంపతులు ఊరికే ఉండలేదు. పెళ్లికుమార్తె బంధువర్గంలోని ఓ మహిళ నుంచి బంగారు ఆభరణాలు దొంగిలించారు. పెళ్లికి వచ్చిన ఇతరులు వారి నిర్వాకాన్ని గమనించి పట్టుకున్నారు. వారిని సోదా చేయగా మూడు తులాల బంగారం దొరికింది. దాంతో అక్కడున్న వాళ్లు ఆ దొంగ దంపతులను చితకబాదారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. పరమేశ్, యశోదలను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు.

More Telugu News