చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దే మా అడ్డా పెడతాం: బండి సంజయ్
- పాతబస్తీ నుంచి దేశ ద్రోహులను తరిమేస్తాం
- వరద బాధితులను కేసీఆర్ పరామర్శించలేదు
- పాతబస్తీలో ప్రచారం చేసే దమ్ము కేసీఆర్ కు లేదు
హైదరాబాద్ పై కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని... కానీ, అవన్నీ నీటి మీద రాతలే అయ్యాయని బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్ మార్పు, అభివృద్ధి బీజేపీతో సాధ్యమని చెప్పారు. వరద బాధితులను ముఖ్యమంత్రి పరామర్శించకపోవడం దారుణమని అన్నారు. నిరుద్యోగులతో ప్రభుత్వం ఆడుకుంటోందని, ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేదలను మోసం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు.